గులాబీ బాస్ కేసీఆర్ గేర్ మార్చారు. దసరా పండుగ తర్వాత రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ అచ్చంపేట నుంచి ప్రారంభించారు. అచ్చంపేట ఆశీర్వాద సభలో ప్రసంగించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. కాంగ్రెస్ నేతల హామీలు, సవాళ్లకు కౌంటర్లు ఇస్తూ దుమ్ములేపారు.
నవంబరు 30న దుమ్ములేపాలి..
మొదటగా కొడంగల్లో పోటీ చేయాలన్న రేవంత్ రెడ్డి సవాల్ను ప్రస్తావించిన కేసీఆర్.. ఇప్పుడు కొందరు దమ్ముందా.. నువ్వు కొడంగల్కు రా.. నువ్వు గాంధీ బొమ్మ దగ్గరికి రా అని సవాళ్లు విసురుతున్నారు. కేసీఆర్ దమ్ము సంగతి దేశం మొత్తం చూసింది. నువ్వేం చూడాలి? ఎదురున ఉన్న మీరంతా కేసీఆర్ దమ్ము కాదా? ఈ దమ్ము గట్టిగా పైకిలేస్తే దుమ్ము దుమ్ము లేవదా.. నవంబరు 30న దుమ్ము రేగాలన్నారు.
ఒకడు కొడంగల్ రమ్మంటున్నడు.. ఒకడు గాంధీ బొమ్మ దగ్గరికి రమ్మంటుండు
కేసీఆర్ దమ్ము ఏందో దేశం మొత్తానికి తెలుసు ????
– అచ్చంపేట సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. #KCROnceAgain pic.twitter.com/RQGLRVyAmr
— BRS Party (@BRSparty) October 26, 2023
24 గంటల కరెంట్ కావాలా.. ?
ఇక 24 గంటల కరెంట్ అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. కాంగ్రెస్ నేతలు 3 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు. సరిపోతదా.. మూడు గంటలు కావాలా.. 24 గంటల కరెంట్ కావాలా అని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ కావాలన్న వాళ్లు చేతులు ఎత్తాలని కేసీఆర్ కోరారు. ఆశీర్వాద సభకు తరలివచ్చిన ప్రజలు చేతులు పైకి ఎత్తి కేసీఆర్కు మద్దతు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని విమర్శించారు. మాట తప్పే వాళ్లెవరో.. నిలబెట్టుకునే వాళ్లేవరో ఆలోచించి ఓటేయండి. ఇంటికి పోయిన తర్వాత ఊరిలో, బస్తీలో కేసీఆర్ మాటల్లో నిజం ఏంటో చర్చించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.#KCROnceAgain#VoteForCar pic.twitter.com/qPEzRUWGB6
— BRS Party (@BRSparty) October 26, 2023