బండి సంజయ్ వార్నింగ్‌తో వెనక్కి తగ్గిన వేములవాడ ఆలయ అధికారులు

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పనులు మొదలైతే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రా­జ­న్న మొ­క్కు­లు.. భీ­మ­న్న­కు ఎలా చె­ల్లి­స్తా­ర­ని ప్ర­శ్నిం­చా­రు. భక్తుల మనో­భా­వా­ల­కు భంగం కలి­గి­స్తే చూ­స్తూ ఊరుకోబోమని హె­చ్చ­రిం­చా­రు. రెం­డు రో­జులు సమయం ఇస్తు­న్నా­మ­ని ఆ లో­పు ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఏం చే­యా­లో అది చేస్తామన్నారు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో సమక్క సారలమ్మ జాతర జరుగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. ఈ క్రమంలో భక్తులకు LED స్ర్కీన్‌లపై దర్శనం కల్పించనున్నట్లు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి ప్రకటించారు. ఆలయ విస్తరణ, నిర్మాణ పనుల నేపథ్యంలో LED స్ర్కీన్‌లపై తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు. అర్జిత సేవలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, మేడారం జాతర సమయంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ముందు, తర్వాత తాత్కాలిక ఏర్పాట్లతో దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు.
Previous articleకేటీఆర్ ఆరోపణలపై విచారణకు ఆదేశం
Next articleIPS ఆత్మహత్య.. ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు