వన్డే వరల్డ్కప్లో నెదర్లాండ్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లోనూ గెలుపొంది సెమీస్కు సిద్ధమైంది. ఎల్లుండి జరిగే తొలి సెమీస్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడుతుంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించాడు. భారత జట్టులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ చేశారు. భారత బౌలర్లలో బూమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా తలో రెండు వికెట్లు తీయగా, కోహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.
More bowling options in Bengaluru ????????
Shubman Gill ???? Suryakumar Yadav
Follow the match ▶️ https://t.co/efDilI0KZP#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/Zlt7EzlqFW
— BCCI (@BCCI) November 12, 2023
వన్డేల్లో విరాట్ కోహ్లి తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీశాడు. వన్డేల్లో విరాట్కు ఇది ఐదో వికెట్. విరాట్ తన వన్డే కెరీర్లో అలిస్టర్ కుక్, కీస్వెట్టర్, డికాక్, మెక్కల్లమ్, స్కాట్ ఎడ్వర్డ్స్ల వికెట్లు పడగొట్టాడు. విరాట్ టీ20ల్లో (4), ఐపీఎల్లోనూ (4) వికెట్లు పడగొట్టాడు.
That wicket feeling! ????#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/CRP3d2tdRA
— BCCI (@BCCI) November 12, 2023