త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై బీజేపీ (BJP) అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధిష్టానం దూకుడు పెంచింది. తెలంగాణ (Telangana), రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్లను ప్రకటించింది.
తెలంగాణకు ఎన్నికల ఇన్ఛార్జ్గా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ను నియమించిన అధిష్టానం.. సునీల్ బన్సల్ను సహాయ ఇన్ఛార్జ్గా నియమించింది. ఛత్తీస్గఢ్ ఎన్నికల ఇన్ఛార్జ్గా ఓపీ మాథుర్, సహాయ ఇన్ఛార్జిగా కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ, రాజస్థాన్కు ఇన్ఛార్జ్గా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ, సహాయ ఇన్ఛార్జిగా గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మధ్యప్రదేశ్కు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఇన్ఛార్జ్గా, కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ను సహాయ ఇన్ఛార్జిగా నియమించింది.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने आगामी विधानसभा चुनाव – राजस्थान, छत्तीसगढ़, मध्य प्रदेश एवं तेलंगाना के लिए प्रदेश चुनाव प्रभारी एवं सह-चुनाव प्रभारियों की नियुक्तियां की। pic.twitter.com/d3l1ctNcVZ
— BJP (@BJP4India) July 7, 2023
ఇప్పటికే తెలంగాణ BJP అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. BJP అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్గా చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు బాధ్యతలు అప్పగించింది. మరో మూడు రాష్ట్రాలకూ కొత్త అధ్యక్షులను నియమించింది.
Hearty congratulations to Shri @PrakashJavdekar ji and Shri @sunilbansalbjp ji on your appointment as BJP Telangana State Election Incharge (Prabhari) and Co-Incharge (Sah-Prabhari).
Looking forward to your direction and support in the fight against the corrupt & dynastic rule… pic.twitter.com/bzSFz0D09D
— G Kishan Reddy (@kishanreddybjp) July 7, 2023