ఫిర్యాదులపై డీజీపీని నివేదిక కోరిన పవన్ కల్యాణ్

పేకాట శిబిరాల నిర్వహణపై డిప్యూటీ సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు
డీజీపీని నివేదిక కోరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్‌లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ – 1974 ప్రకారం శిక్షార్హులు అవుతారు అని చట్టం చెబుతోంది. రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జూద కేంద్రాలు సాగుతున్నాయని డిప్యూటీ సీఎం కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
పేకాట క్లబ్బుల నిర్వహణపై ఆ ఫిర్యాదుల్లో తెలిపారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారి మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు, పోలీసు అధికారులకు దీనిపై ఉన్న సమాచారం తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై ఆరా తీశారు. ఒకవేళ పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలని డిప్యూటీ సీఎం రాష్ట్ర డీజీపీకి స్పష్టం చేశారు.
Previous articleరాహుల్ గాంధీ త్వరగా పెళ్లి చేసుకోండి
Next articleByPoll: అక్కడ బడ్గాం.. ఇక్కడ జూబ్లీహిల్స్.. గెలుపెవరిది?..